Home » Exit polls
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పోలింగ్ ఏజెన్సీ టుడేస్ చాణక్య వెల్లడించింది. మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 192 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది.
తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి భారీ స్థాయిలో సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎమ్కే పార్టీ విజయ్తో చర్చలు జరిపే యోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
తమిళనాడు ఓటర్లు మళ్లీ స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 122 నుంచి 145 సీట్లు దక్కుంచుకోనున్నట్టు కనీసం మూడు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పాయి.
బెంగాల్లో చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్ టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి.
కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది.
అస్సాంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోనుంది. వరుసగా హ్యాట్రిక్ విజయం అందుకోబోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ 85 నుంచి 95 సీట్లు గెలుచుకోనుందని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్పై పడింది. బెంగాల్తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన పోరు కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా.. భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షగా మారింది. ఫలితాలు స్పష్టమయ్యాక ఇప్పుడు చర్చంతా ఒకటే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయని. ఆ వివరాలను ఓసారి చూద్దాం..
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.