Home » England
అండర్-19 ప్రపంచ కప్లో వింత రనౌట్ జరిగింది. అది కూడా పాకిస్థాన్, ఇంగ్లాండ్ మ్యాచులో చోటుచేసుకుంది. ఆ రనౌట్ కారణంగా పాకిస్థాన్ ఓడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
ఇంగ్లండ్పై ఇప్పటికే యాషెస్ సిరీస్ సాధించిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఆఖరిదైన ఐదో టెస్టునూ సొంతం చేసుకుని సిరీస్ను 4-1తో ఘనంగా ముగించింది. ఐదో టెస్టులో కంగారూ జట్టు 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై గెలిచింది. తమ ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడాడు. మరో 100 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు.
ఇంగ్లాండ్ వైట్బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కు బిగ్ షాక్ తగిలింది. అతడికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 30 వేల పౌండ్ల(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.36 లక్షలు) జరిమానా విధించింది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆసీస్పై 119 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జాకబ్ బెథెల్(142*) అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఐదో టెస్టు ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 211/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 384 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లాండ్ లెజెండరీ బౌలర్ జేమ్స్ అండర్సన్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీతో సాగించిన పోరాటం అత్యంత చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా.. భారత్ నుంచి కోహ్లీ తన ఫేవరెట్ ప్లయర్ అని అండర్సన్ వెల్లడించారు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. జోరు మీదున్న ఇంగ్లండ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. చాలా సేపు వేచి చూసినా వరుణుడు కనికరించకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో 138 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడింది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే బోండీ బీచ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిడ్నీ మైదానం లోపల, వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు.
యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో తలపడ్డాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్.. ఆసీస్ గడ్డపై ఘన విజయం సాధించింది. ఈ ఆట రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం.