Home » Election Campaign
తెలంగాణలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 ....
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీఫారం అందించేందుకు మంగళవారం వరకు గడువు ఉంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్ ఫోన్ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.
సర్పంచ్ ఎన్నికల్లో చేగుంట మండలం గొల్లపల్లిలో హైడ్రామా నెలకొంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త శనివారం రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఓడిపోతామనే భయంతోనే శనివారం రాత్రి నుంచి సర్పంచ్ అభ్యర్థి భర్త జనార్దన్ రెడ్డి కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.
కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదేలేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది.
సర్పంచి పదవికి శ్రీజ అనే ఒక యువతి నామినేషన్ వేయడం, తల్లిదండ్రులు వద్దంటూ ఒత్తిడి చేయడం, ఆ వెంటనే శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకోవడం, పోలీసుల ముందు హాజరై తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పడం.. రాజకీయ మద్దతు. ఇలా.. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో ఒక్క రోజులో సంచలనాలు
బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇవాళ తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.