Home » Eetala Rajender
ట్రెయినింగ్ సెంటర్ల పేరుతో ఉన్మాదులకు శిక్షణ ఇస్తుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్(Secunderabad)లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఎంపీ ఈటల సందర్శించారు.
విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్(Pochampally- Mansoorabad) వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) అన్నారు.
ఓ ఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
మూసీ మురికిలో బతుకుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌజులు కూల్చాలా వద్దా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో సామాన్య ప్రజల్లో భయం సృష్టిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) మండిపడ్డారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నివాసాలను కూల్చివేస్తామంటూ అధికారులు పలు కాలనీల ప్రజలకు నోటీసులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
ప్రజల మీద రేవంత్ ప్రభుత్వం దౌర్జన్యం చేయడం సరికాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా విషయంలో హై కోర్టుకు వెళ్తామని.. తాము చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్రెడ్డి చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు భయటపడకుండా హెడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. పేదల భూములు రేవంత్ జాగీర్ కాదని హెచ్చరించారు. చెరువులు, వాగుల రక్షణకు భూసేకరణ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ది వ్యాంగుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.
కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్ద నిమజ్జనం ప్రక్రియను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(BJP Malkajgiri MP Etala Rajender) డిమాండ్ చేశారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు స్పందిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.