Home » Eetala Rajender
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) పూర్తిగా మునిగిపోవడం ఖాయమని మెదక్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గురువారం నాడు మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్లో బీజేపీ మెదక్ పార్లమెంటు నియోజక వర్గం బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్రెడ్డి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) రూ.34 వేల కోట్ల రుణమాఫీని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చారని ఎలా సాధ్యమని మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender) ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర మెదక్ చేరుకున్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ దేశం అప్పుల కుప్పగా మారుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. సోమవారం నాడు సిద్దిపేట పట్టణంలో బీజేపీ విజయసంకల్ప యాత్ర నిర్వహించింది.
మూడోసారి కూడా నరేంద్రమోదీ ప్రధాని అవడం ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. గురువారం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ... మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉందని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇండియాను అవమానించిన అగ్ర రాజ్యాలు ఇప్పుడు మన మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని మాజీమంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు నర్సంపేటలో ఈటల రాజేందర్ పర్యటించారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) అంతరించిపోయే పార్టీ అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. రాజకీయ భవిష్యత్ ఉండాలంటే బీజేపీతోనే ఉండాలని నేతలు భావిస్తున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) స్పష్టం చేశారు.