Home » Education
రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీ సెట్-2026) దరఖా స్తులను ఈ నెల 19 వరకు ఆన్లైన్లో స్వీక రించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) ఆధ్వర్యంలో ఈ సెట్ జరగనుంది.
భారత సైన్యంలో అగ్నివీర్ (జనరల్/ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి పురుషుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల ఒకటిలోగా వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్సెట్ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్సెట్, బీఎడ్, బీటెక్, ఐసెట్ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయిని కూర్మాన అరుణకుమారిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఆధునిక విద్యా విధానంలో మార్పులు తెస్తూ, విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యార్థి దశలో కీలకమైన ఘట్టం పదోతరగతి పరీక్షలు. మార్చి 16వ తేదీ నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలయింది.
ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా, మార్చి 2న జరగాల్సిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
సీబీఎస్ఈలో ఇకపై ఆరో తరగతి నుంచి మూడో భాష ఎంపిక విధానం అమలు కానుంది. ఎన్ఈపీ-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిబంధనను తప్పనిసరి చేసింది.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ విద్యామండలి కమిషన్ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ పలు కీలక సూచనలు చేసింది.
ఇంటర్మీడియట్వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు 5,14,598 మంది హాజరు కావాల్సి ఉండగా.. 4,98,695 (96.90శాతం) మంది హాజరయ్యారు....
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల సందడి మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షలు కావడంతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.