Home » Education
రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఎస్ఎ్సఏ ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కీలక సాక్ష్యాలు లేకుండా చేసినా.. ‘టవర్ డంప్’ ద్వారా డిన్నర్ జరిగిన డాబా ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో కనిపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎస్పీ ద్వారా విందు జరిగిన ప్రాంతంలో సెల్ఫోన సిగ్నల్స్, కాల్డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
పదో తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో 40,063 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ ముద్దుబిడ్డ మెరుగు కౌషిక్ సివిల్స్ లో సత్తా చాటాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 82వ ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టాడు.
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజీల్లో న్యాయ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష గడువును పొడగించారు. తొలుత ప్రకటించిన గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు అవకాశం ఇచ్చారు.
ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాల ( Education ) నేపథ్యంలో మే లో నిర్వహించనున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు వివరాలు వెల్లడించింది.
పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటర్ ( Inter ) రీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. టర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను..
కొత్త విద్యాసంవత్సరం(2024–25) నుంచి 6, 9, 11 తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)’ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ అనుబంధ పాఠశాలలను బుధవారం ఆహ్వానించింది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో అవినీతి చిత్ర విచిత్రాలుగా కన్పిస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 2022-23లో 45.13 లక్షల విధ్యార్ధులతో విద్యా కానుక ఖర్చు రూ.886 కోట్లు అని.. 2023-24 కి దాదాపు 5.5 లక్షల పిల్లలు తగ్గిపోయి, 39.80 లక్షలకు తగ్గితే విద్యా కానుక ఖర్చు మాత్రం రూ. 270 కోట్లు పెరిగి రూ.1042 కోట్లకు చేరిందన్నారు.