Home » DMK
వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే పార్టీల మధ్య శత్రుత్వం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. కరుణానిధిపై కోపంతోనే నటుడు ఎమ్జీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి ఆ రెండు పార్టీల మధ్య శత్రుత్వం కొనసాగుతోంది.
ఇండియా కూటమి ముఖ్య భాగస్వామి కాంగ్రెస్ టీవీకే పార్టీతో పొత్తుకు సిద్ధం కావడంపై డీఎమ్కే పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్కు ఆ హక్కు ఉందని డీఎమ్కే ఎంపీ కనిమొళి పేర్కొనగా పార్టీ ప్రతినిధి అన్నాదురై మాత్రం కాంగ్రెస్ నిర్ణయాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు.
తమిళనాడులో డీఎంకే ఓటమి పట్ల ఆ పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. వాటిని సమానంగా స్వీకరించే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రావిడ పార్టీలను విస్మయానికి గురిచేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ సెంటర్ల వద్ద అంతరాయాలు కలిగించడానికి బీజేపీ పథక రచన చేస్తోందని అధికార డీఎంకే (DMK) ఆరోపించింది. పెద్దఎత్తున శాంతిభద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్.భారతి ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారంనాడు లేఖ రాశారు.
గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
ప్రజాహిత బిల్లులను అడ్డుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుందని పేర్కొన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార డీఎంకే చెన్నై నగరవాసులపై వరాల జల్లులు కురిపించింది. ప్రపంచ స్థాయి సిటీగా చెన్నైను తీర్చిదిద్దుతామని, రూ.10,000 టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించింది.