Home » DMK
నీలగిరి రిజర్వుడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎ.రాజా(A. Raja) రూ.21.61 కోట్ల మేరకు చర, స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఈ మేరకు తన నామినేషన్లో అఫిడవిట్ను సమర్పించారు.
తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనితో పాటు ఎన్నికలకు అభ్యర్థుల జాబితానూ ప్రకటించింది. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కనిమొళితో పాటు ఇతర పార్టీ నేతలు ఉన్నారు.
తమిళనాడులో ఎట్టకేలకు డీఎంకే, కాంగ్రెస్ మధ్య లోక్సభ ఎన్నికల కోసం సీట్ల ఒప్పందం కొలిక్కి వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీని (PM Narendra Modi) ఉద్దేశిస్తూ తమిళనాడు మంత్రి అన్బరసన్ (DMK Minister Anbarasan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిని కాకపోయి ఉంటే, ప్రధానిని ముక్కలు ముక్కలుగా నరికేవాడినంటూ కుండబద్దలు కొట్టారు. ఎంతోమంది ప్రధానమంత్రుల్ని చూశానని, కానీ మోదీలా దిగజారుడు మాటలు మాట్లాడే పీఎంని చూడలేదని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు మక్కల్ నీది మయ్యం కట్చి అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు.
ఏ కూటమిలో చేరినా ఓటమి ఖాయమనే భయంతోనే మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్(Kamala Haasan) అవినీతి అక్రమాలకు నెలవైన డీఎంకే కూటమిలో చేరి ఆ పార్టీ అవినీతికి గట్టి మద్దతు ప్రకటించారని కేంద్రమంత్రి ఎల్.మురుగన్(Union Minister L. Murugan) విమర్శించారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నాయకుల కోసం వాణిజ్య నగరమైన కోయంబత్తూరులో సకల సదుపాయాలతో హైటెక్ ప్రచార వాహనాలు తయారవుతున్నాయి.
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేంద్రప్రభుత్వం సిలిండర్ ధర తగ్గించిందని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విమర్శించారు.