Home » Delhi
వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
కొంతకాలంగా ఢిల్లీలో కట్టెల పొయ్యిల వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిల వాడకానికి అధికారికంగా అనుమతి నిచ్చింది.
నిర్భయ నిధి కింద తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
వ్రిక్షిత్ ఫౌండేషన్కు చెందిన వాలంటీర్లు నగరంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఓ ఏరియాలోని ఫుట్పాత్ పక్కన ఉన్న చెత్త క్లీన్ చేస్తూ ఉండగా.. వారికి మనిషి పుర్రె, ఎముకలు దొరికాయి.
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల నియమాలను రూపొందించేలా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే అది వాళ్ల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
హరీశ్ రాణాకు కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ సంచలన తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా కీలక కామెంట్స్ చేశారు.
13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రమాదవశాత్తూ కిందపడి తలకు తీవ్ర గాయాలై.. జీవచ్ఛవంలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి అనుమతించింది.
పుస్తక వివాదంపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. సోమవారం బహిరంగ క్షమాపణలు చెప్పింది. పుస్తకం మొత్తాన్ని ఉపసంహరించుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవటంతో బెంగళూరు, చెన్నై, ముంబైలలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నగరాల్లోని దాదాపు 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి.