Home » Delhi
'సంచార్ సాథీ' అంశం ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. ఈ యాప్ తీసుకురావడం ప్రజల ప్రైవసీని కేంద్రం హరించడమేనని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై చర్చకు వ్యతిరేకం కాదని అధికార పక్షం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించడం లేదు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చింది. రాజ్ భవన్తో పాటు పీఎంఓ పేరు కూడా మార్చింది. పీఎంఓ పేరును సేవా తీర్థ్గా మార్చింది.
ఈ రాత్రి 8 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. తిరిగి రేపు రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు.
ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్పై వైసీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు.
ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనమే కారణమన్న కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లు, సెలెబ్రిటీలు సైతం డిజిటల్ అరెస్ట్ స్కామ్ల బారిన పడుతున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
ఢిల్లీకి చెందిన ఓ యువకుడు రోడ్డు పక్కన పడున్న రాళ్లను తన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. వాటిని అందమైన గడియారాలుగా మార్చి అమ్మేస్తున్నాడు. వందల నుంచి వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.
ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగబోతోన్న తరుణంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలు చర్చించారు.
దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో మంటలు చెలరేగగా.. ప్రమాదాన్ని పసిగట్టి తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.