Home » Delhi liquor scam
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటి ముగిసింది. దీంతో కాసేపటి క్రితమే కవితను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ చదవుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కుంటున్నారు. అయితే విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు.
ED Raids On Kavitha Family Members: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి ఈడీ (ED) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) అరెస్టులు జరిగాయని హస్తిన వర్గాలు చెబుతున్న మాట..
కేజ్రీవాల్ను మార్చి 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేయడానికి ముందు లిక్కర్ స్కామ్లో 9 సార్లు, ఢిల్లీ జల మండలిలో అవకతవకలపై ఒక సారి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు. రాజకీయ కుట్రలో భాగంగా నోటీసులు జారీ చేశారని, తాను విచారణకు హాజరుకానని చెప్పారు. 142 రోజుల వ్యవధిలో ఈడీ 10 సార్లు సమన్లు జారీ చేసింది.
ఆర్థిక నేరారోపణల కింద తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఎప్పటికప్పుుడు లేఖలు విడుదల చేస్తూ.. పలు సంచలనాలకు కేరాఫ్గా మారాడు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత, ఆప్ నేతలు కేజ్రీవాల్, సత్యేంద్రజైన్, సిసోడియాపై సంచలన ఆరోపణలు చేస్తూ సుఖేష్ ఇప్పటికే పలు లేఖలు విడుదల చేశాడు. తాజాగా కవిత అరెస్ట్కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ లేఖ రాసిన సుఖేష్.. అరవింద్ కేజ్రీవాల్ను వదిలిపెట్టలేదు.
Telangana: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు కవితను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు.. మరోవైపు ఆమె బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కవిత ఆడపడుచు నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది.
ప్రముఖుల అరెస్టులతో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. మరోవైపు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగియనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టు అవ్వడంతో.. ఆయన రాజీనామా చేస్తారా? తదుపరి పరిణామాలేంటి? అనే చర్చలు మొదలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) అయితే.. కేజ్రీవాల్ రాజీనామా చేయరని, వీలైతే జైలు నుంచే పరిపాలన సాగిస్తారని తెలిపింది. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే క్లారిటీ ఇచ్చారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పోస్టుకు రిజైన్ చేయనని తేల్చి చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన్ని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.