Home » Dasarath
పండుగ అయిపోయి దాదాపు వారం రోజులవుతున్నా దసరా మామూళ్ల గోల తగ్గడం లేదు. జిల్లాలో రేషన్ షాపులకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే మండల లెవల్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్)లకు ఇంకా దసరా మామూళ్లు అందలేదట. దీంతో త్వరగా పంపాలంటూ తెగ ఫోన్లు కొడుతున్నట్లు సమాచారం.
చెడుపై మంచి గెలిచిన రోజు(దసరా పండుగ).. అంతర్జాతీయ అహింసా దినం(మహాత్ముడి జయంతి).. రెండూ ఈ ఏడాది ఒకేరోజు రావడం కాకతాళీయమే. అయితే ఆ పర్వదినాల పరమార్థం ఒక్కటే. అదే ‘సత్యమేవ జయతే’. ప్రశ్నించే తత్వాన్ని వారసత్వంగా మనకు అందించారు బాపూజీ.
బతుకమ్మ పండుగతో ప్రారంభమైన షాపింగ్ సందడి, దసరా పండుగ ముందు రోజు వరకూ కొనసాగుతూనే ఉంది. పండుగ వేళ నూతన వస్త్రాలను కొనడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి జీఎ్సటీ రేట్ల తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలోనూ జోష్ కనిపించింది.
మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన జంబూసవారికి రాచనగరి సిద్ధమవుతోంది. గురువారం మధ్యాహ్నం జంబూసవారి వేడుకలు జరగనున్నాయి. వందలాది కళాబృందాలు, అశ్వదళం సాగుతుండగా గజరాజుల ఊరేగింపు జంబూసవారిలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
మైసూరు దసరా ఉత్సవాల్లో ఈసారి డ్రోన్షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాముండేశ్వరి విద్యుత్ సరఫరా కంపెనీ (సెస్క్) ఆధ్వర్యంలో బన్నిమంటప మైదానంలో ఆదివారం డ్రోన్ షో ప్రారంభమైంది. సుమారు 3వేల డ్రోన్లను ఉపయోగించి కొత్త లోకాన్ని సృష్టించారు.
మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి తెలిసి ఉండటంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు.
ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్కోయిల్-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్ ఫాస్ట్ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్కోయిల్లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
బతుకమ్మ, దసరా(Bathukamma, Dussehra) పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ చార్జీల షాక్ ఇచ్చింది. పండుగ సందర్భంగా నడుపుతున్న స్పెషల్ బస్సుల్లో అదనంగా 25 శాతం చార్జీలు పెంచింది. నగరం నుంచి తెలంగాణ, ఏపీలోని జిల్లాలకు వెళ్లే స్పెషల్ సర్వీసులకు ఈ చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.
దసరా, సద్దుల బతుకమ్మ పండుగల(Dasara and Saddula Bathukamma festivals) నేపథ్యంలో ఇటు తెలంగాణ జిల్లాలకు, అటు ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) కిటికిటలాడుతోంది. ఒకవైపు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కావడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సద్దుల బతుకమ్మ, దసరాకు 6,304 ప్రత్యేక బస్సులను జిల్లాలకు నడుపుతున్నామని, స్పెషల్ ఆపరేషన్స్కు పోలీస్, రవాణా శాఖల అధికారులు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGS RTC MD VC Sajjanar) కోరారు.