Home » Cyber attack
ఎక్కడుంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు. కానీ.. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ రోజుకు లక్షల రూపాలయలను దోచేస్తున్నారు. నగరంంలో సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతేలేకుండా పోతోంది. ప్రతి రోజూ ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఆన్లైన్లో మెడిసిన్ కోసం వెదికుతున్న వ్యక్త నుంచి రూ.2.25 లక్షలు కొట్టేశారు. ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలో సైబర్ మోసానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఈ తరహ మోసాలపై ప్రజల్లో ఒకింత అవగాహన తక్కువగా ఉండటంతో ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు.
టెక్నాలజీని వాడుకుని అడ్డదారుల్లో డబ్బు కొల్లగొడుతున్న ఓ సైబర్ నేరగాడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఓ వైద్యుడి నుంచి రూ.1.23 కోట్లు కొట్టేసిన అతగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పెరిగిన టెక్నాలజీతో ప్రతిరోజూ ఈ తరహ మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. అయితే.. ఏదీ ఎంతకాలం ఆగదుగా.. పాపం పండి చివరకు జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
WhatsApp Photo scam Alert: వాట్సాప్ యూజర్లు జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ అకౌంట్లపై కన్నేసారు. మీరు అలవాటు ప్రకారం తెలియక ఇలా చేశారంటే మాత్రం ఫోన్ క్షణాల్లో హ్యాక్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. యూజర్ల స్కామర్ల చేతికి చిక్కకూడదంటే వెంటనే ఇలా చేయాలని టెలికాం శాఖ అధికారులు సూచిస్తున్నారు.
దాయాది దేశం పాకిస్థాన్ నీచపు బుద్దులు, వారి పనులు ఆ దేశాన్ని మరింత దిగజారుస్తున్నాయి. ఆర్మీ స్కూల్, ఆర్మీ సిబ్బంది సంక్షేమ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని పాక్ హ్యాకర్లు తోకలు జాడించారు. అయితే.. భారత్ అన్నీ కట్ చేసి పంపింది.
ఇన్స్టాగ్రామ్ లింక్పై నమ్మి రూ.2.46 కోట్లు కోల్పోయిన మహిళ కేసులో ఏడుగురు సైబర్ నేరగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని మోసగాళ్లు నమ్మించి మోసం చేశారు.
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆన్లైన్లో అవకాడోలు బుక్ చేసిన వ్యక్తిని మాయ చేసి సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్సటికే ఎన్నో అక్రమార్గాలను ఎంచుకుని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలన కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మరో కొత్త ప్లాన్ తో రూ.2.60 లక్షలు దోచేశారు.
Army Nursing College: గతంలోనూ టీమ్ ఇంసేన్ పాక్ గ్రూపు గతంలోనూ సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ, ఇతర వెబ్ సైట్లను హ్యాక్ చేయడానికి ఈ గ్రూపు ప్రయత్నించింది. 2023 జీ20 సమ్మిట్ సమయంలోనూ ప్రభుత్వ వెబ్ సైట్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తరచుగా సైబర్ దాడులకు పాల్పడుతూ విఫలం అవుతూ వస్తోంది.
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. ఇప్పటికే వివిధ పద్దతుల్లో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న ఈ కేటుగాళ్లు తాజాగా.. నకిలీ వెబ్సైట్ సృష్టించి భక్తులను దోచుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరం సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబర్ మోసం జరుగుతూనే ఉంది. నగరంలోని ఓ ఏరియాకు చెందిన వృద్ధుడి(78)ని బురిడీ కొట్టించి రూ.3.99లక్షలు కొట్టేశారు. ఈ సైబర్ నేరాలపై ఇంకా ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం, సైబర్ మోసగాళ్లు పోలీసుల మాదిరిగా, బ్యాంకు అధికారుల లాగే మాట్లాడుతుండడంతో మోసపోవాల్సి వస్తోంది.