Home » CSK
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే మూడు జట్లు అర్హత సాధించగా.. నాలుగో స్థానం కోసం పోటీ నెలకొంది. లీగ్ స్టేజ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరొక్క మ్యాచ్ మాత్రమే ఆడనుంది. అయినప్పటికీ సీఎస్కేకి ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అదెలాగంటే..
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని తప్పించి సంజు శాంసన్కు జట్టు పగ్గాలు అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు.
వచ్చే ఐపీఎల్ సీజన్లో అయినా ధోని చెన్నై జెర్సీలో కనిపిస్తాడా? కీపింగ్ గ్లవ్స్తో స్టంప్స్ వెనకాల నిలబడతాడా? అనే ప్రశ్నలు అభిమానుల మదిలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ధోని భవిష్యత్తుపై స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలకనున్నాడా? ఈ ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ధోని రిటైర్మెంట్పై ప్రచారం ఊపకుందున్న నేపథ్యంలో.. ఐదేళ్ల క్రితం తన రిటైర్మెంట్ గురించి తలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చర్చనీయాంశం అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్-సీఎస్కే సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.
చెపాక్ వేదికగా మే 18న సీఎస్కే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్లోనైనా ధోని బరిలోకి దిగుతాడా? లేదా? అనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఓ గుడ్ న్యూస్తో పాటు.. ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎల్ఎస్జీ బ్యాటర్లు మిచెల్ మార్ష్, పూరన్.. కాంబోజ్ను టార్గెట్ చేసి విజృంభించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.