Home » Crime
కన్నడ నటి రన్యా రావు 127.3 కిలోల బంగారం అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో డిఆర్ఐ రూ.102.55 కోట్లు జరిమానా చెల్లించాలని ఆమెకు నోటీసు జారీ చేసింది.
కూకట్పల్లికి చెందిన పదకొండేళ్ల బాలిక సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రికెట్ కిట్ కొనుక్కోవాలనే కోరిక పదిహేనేళ్ల కుర్రాడిని హంతకుడిగా మార్చిందని పోలీసులు సంచలన నిజాలు బయటపెట్టారు.
ధర్మస్థల సామూహిక ఖననం కేసులో ప్రధాన సాక్షి తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ ప్రాంతంలో 80 మృతదేహాలను తన చేతులతోనే పాతిపెట్టానని చెప్పడంతోపాటు.. ఎలా ఖననం చేశాడో వివరించాడు.
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ నటుడు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా 7 మంది నిందితుల బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో పోలీసులు మరోసారి పవిత్ర గౌడను అరెస్టు చేశారు.
రాజధాని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చందానగర్లోని ఖజానా జువెలరీలో భీభత్సం సృష్టించారు.
రాతియుగాన్ని తలపించేలా కొందరు కలిసి దళిత యువకుడైన పవన్పై విచక్షణారహితంగా దాడి చేయడం దురదృష్టకరమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎ్స.జవహర్ అన్నారు.
కన్నప్రేమను మర్చిపోయి..మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. అకారణంగా కొడుకు తలపై బండరాయితో దారుణంగా కొట్టి హింసించింది. తీవ్రగాయాలైన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
‘ఉచితం’ మాటున నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేస్తున్నారు. పగలంతా ఒక ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. రాత్రిళ్లు రాష్ట్ర సరిహద్దులు దాటించి తమిళనాడుకు తీసుకెళుతున్నారు. ఇలా రాత్రింబవళ్లు ఇసుక దందా సాగిస్తున్నా అధికారులు కిమ్మనడంలేదు.
చీకటి పడితే చాలు.. ఆ వెంటనే ఎక్స్కవేటర్ల రొద మొదలవుతుంది. ప్రభుత్వ భూమిని చీల్చి గ్రావెల్ను తవ్వుతాయి. టిప్పర్లు రయ్మంటూ పరుగులు తీస్తాయి. ఇలా పూలతోటమిట్టలో మొదలయ్యే గ్రావెల్ అక్రమ రవాణా సూళ్లూరుపేట, తడ ప్రాంతాలకు సాగుతోంది.
సృష్టి కేసు వ్యవహారంలో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవ రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. మొదటి రోజున విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన డాక్టర్ నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.