Home » Crime
బాలీవుడ్ సినిమా 'ధూమ్' స్టైల్లో ఫ్రాన్స్లో ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ దొంగతనం సంచలనంగా మారింది. మ్యూజియంలోకి చొరబడిన దొంగలు క్షణాల్లోనే ఆభరణాలను చోరీ చేశారు. దీంతో పారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
చాదర్ఘాట్లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు కత్తితో దాడికి యత్నం చేశారని డీజీపీ తెలిపారు. సెల్ఫోన్ స్నాచింగ్కు పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారని.. డీసీపీ చైతన్య కుమార్, గన్ మెన్ మూర్తి 750 మీటర్లు వెంబడించి నిందితులను చేజ్ చేశారని తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సైడ్ ఐరన్ భారీ గేట్లను ఢీ కొట్టింది.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఉమ్మడి జిల్లావాసులను కంటతడి పెట్టించింది. ఉదయం లేవగానే ఈ విషాదకర సంఘటన గురించి తెలుసుకుని జనం ఆవేదన చెందారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాలో ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారు. జాతీయ రహదారులపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో ప్రయాణం ...
సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. రూ.12.65 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు.. కంపెనీ డైరెక్టర్ పూర్ణచందర్రావుతో పాటు కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తన చావుకు పోలీస్ అధికారి, ఎస్సై గోపాల్ బద్నే కారణమంటూ మహిళా డాక్టర్ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ లో ఒక హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కేవలం రూ. 150-200 ఖర్చుతో తయారయ్యే కాల్షియం కార్బైడ్ తుపాకీ( Lethal Calcium carbide gun), పిల్లల జీవితాల్లో అంధకారం సృష్టించింది. కళ్ళకు గాయాలు కావడంతో పిల్లలందరిని ఆసుపత్రులకు తరలించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ టీచర్ పై భజరంగ్ దళ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల దాడి చేశారు. విద్యార్థినుల పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ భజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు దాడికి దిగారు.
భర్తపై మరిగే నీళ్లు, యాసిడ్ పోసింది ఓ భార్య. అసలు, భార్య అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండగపూట విషాదం నెలకొంది. నాగలక్ష్మి అనే మహిళ.. తన ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు