Home » Crime News
బిహార్లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ రాక్షసుడు అన్నెం పున్నెం ఎరుగని ఏడు నెలల చిన్నారని అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇందుకు కారణం.. భార్య తన తమ్ముడిని పెళ్లి చేసుకోవడమే. తాను జైల్లో ఉన్నప్పుడు భార్య తమ్ముడ్ని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనివ్వడంతో..
ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృత్యువాత చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్(brazil) పోర్టో అలెగ్రే(Porto Alegre) నగరం గరోవా ఫ్లోరెస్టా హోటల్లోని మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది.
సమాజంలో రోజురోజుకి బంధాలు, అనుబంధాలు తెగిపోతున్నాయి. కుటుంబ సభ్యులే ఒకరినొకరు హత్య చేసుకుంటూ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రియుడి కోసం ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది.
ఉత్తర్ప్రదేశ్ చైల్డ్ కమిషన్(Uttar Pradesh Child Commission) శుక్రవారం ఏకంగా 95 మంది చిన్నారులను రక్షించింది. ఆ చిన్నారులను బీహార్(Bihar) నుంచి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు అక్రమంగా తీసుకెళ్తున్నట్లు క్రమంలో అధికారులు పట్టుకున్నారు. అయితే వారిని ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని సమాచారం తెలియాల్సి ఉంది.
ధర్మవరం, ఏప్రిల్ 26: పట్టుచీర డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు సోదరుడిని హత్య చేయడంతో పాటు అడ్డువచ్చిన పెద్దమ్మ, మరో సోదరుడిని కత్తితో గాయపరిచాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన పట్టణంలోని గీతానగర్లో శుక్రవారం రాత్రి జరిగింది. వనటౌన పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గీతానగర్లో నివసిస్తున్న సావిత్రి మగ్గం నేసుకుంటూ పట్టుచీరలు అమ్ముతుండేది. ఆమెకు ఇద్దరు కుమారులు పెద్దమణికంఠ, చిన్నమణికంఠ(23) ఉన్నారు. కాగా సావిత్రి కొంతకాలం క్రితం ఓ పట్టుచీరను తన చెల్ల్లెలు నారాయణమ్మ కుమారుడు రమేశకు రూ.10వేలకు అమ్మింది. అతను డబ్బు ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో శుక్రవారం రాత్రి సావిత్రితో పాటు పెద్దమణికంఠ, చిన్నమణికంఠ ఎదురు ఇంట్లో ఉ న్న రమేశను డబ్బులు అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య మాటమాటపెరిగింది.
పాకిస్థాన్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మాజీ పోలీసు అధికారి కొడుకు తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. తన గర్ల్ఫ్రెండ్ కోసం తెచ్చిన బర్గర్లో సగం తినేసిన స్నేహితుడితో గొడవపడి తుపాకీతో కాల్చి చంపేశాడు.
ఐదవ తరగతి వరకే చదివిన ఓ నిందితుడు మోసాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. నిరుద్యొగులకు ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాల పేరిట రూ.2 కోట్ల మేర టోపీ పెట్టాడు.
దంపతుల మధ్య తలెత్తే కొడవలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. అయినా కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో సమసిపోతుంటాయి. తర్వాత యథావిధిగా అన్యోన్యంగా జీవనం సాగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు.. చాలా దూరం వెళ్తుంటాయి. చిన్న చిన్న విషయాలకూ..
ఉత్తర ఫ్రాన్స్(France) నుంచి ప్రమాదకరమైన ఇంగ్లిష్ ఛానల్(English Channel)ను దాటేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సహా ఐదుగురు వలసదారులు(migrants) చనిపోయారు. ఈ మేరకు ఫ్రెంచ్ మీడియా సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై UN శరణార్థుల ఏజెన్సీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ సహా పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
భార్యాపిల్లలకు ఆర్థికపరమైన లోటు లేకుండా చూసుకోవాలని.. ఆ భర్త తన కోరికల్ని, ఆశయాల్ని చంపుకొని దేశం కాని దేశానికి వెళ్లాడు. అక్కడ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని.. భారత్లో ఉన్న తన కుటుంబానికి చేరవేస్తూ వచ్చాడు. తాను అక్కడ ఇబ్బందులు పడుతూ..