Home » Crime News
ఆమెకు వివాహం జరిగి కేవలం రెండున్నర నెలలో అయినా.. 8 నెలల గర్భం ఉండడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. తమకు పెళ్లి జరిగి కేవలం రెండున్నర నెలలే అవుతోందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. స్థానికంగా ఈ విషయం తీవ్ర సంచలనానికి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.
ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ప్రమీల (45) అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలు భార్య ప్రమీల అదే గ్రామానికి చెందిన వడ్డే నెట్టికంటికి ఐదేళ్ల కిందట రూ.20వేలు వడ్డీకి అప్పు ఇచ్చింది.
నగరానికి చెందిన బీటెక్ విద్యార్థి చల్లా శ్రవణ్(18) పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తాము ఉంటున్న అపార్టుమెంట్లోని 5వ అంతస్తు నుంచీ దూకి ప్రాణం తీసుకున్నాడు. దీనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.
హిజ్రాలు నిర్వహించిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోనాలిసా అనే హిజ్రాల గ్యాంగ్ లీడర్ తమపై దాడి చేసిందంటూ పలువురు హిజ్రాలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని లైటర్తో నిప్పు అంటించుకుంటుండగా ఏడుగురికి గాయాలయ్యాయి.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు 4తులాల(40 గ్రాముల) బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తూంకుంటలో సోమవారం పట్టపగలే జరిగింది.
క్యాన్సర్ వల్ల కుమారుడు చనిపోగా ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆపై మద్యానికి బానిసయ్యాడు. ఆఖరికి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని తనువుచాలించాడు. ఈ సంఘటన సంజీవయ్యనగర్లో జరిగింది.
కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం, పోశవ్వ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల స్వగ్రామం మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట. అయితే, ఉపాధి నిమిత్తం వారిద్దరూ తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఏడేళ్ల కిందట కరీంనగర్ వావిలాలపల్లికి వెళ్లారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.
రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఈ రోజుల్లోనూ కుల రాకాసి పేట్రేగిపోతోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు అనే తేడా లేకుండా కులానికి బానిసలుగా మారి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు.
దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.