Home » Cricket World Cup
PM Narendra modi: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో దుమ్ములేపుతున్న టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్ పోరులో న్యూజిలాండ్ను చిత్తు చేసిన రోహిత్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. నేక మంది ప్రముఖుల నుంచి టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం సెమీ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయిపోయారు.
World Cup 2023: వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న హిట్మ్యాన్ సాధారణంగానే ఈ మ్యాచ్లోనూ తనదైన స్టైలులో ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించాడు.
India vs New Zealand: వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్లో కీలకమైన టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుంకా బరిలోకి దిగుతోంది.
IND vs NZ Semi-Final: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. సూపర్ ఫామ్లో కింగ్ కోహ్లీ బఠాణీలు తిన్నంత సునాయసంగా పరుగులు చేస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు బాదేసిన కింగ్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ ఏకంగా 594 పరుగులు చేశాడు.
India vs New Zealand: దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. అభిమానులంతా టీమిండియా నామజపంలో మునిగిపోయారు. బుధవారం జరిగే మొదటి సెమీస్ పోరులో న్యూజిలాండ్పై టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అభిమానులు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పలువురు అభిమానులైతే ఆలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
అవును నాలుగేళ్ల క్రితం మనం కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు బదులు తీర్చుకునే సమయం వచ్చేసింది. న్యూజిలాండ్ను దెబ్బకు దెబ్బకు తీసి ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందటి పీడ కలను చెరిపివేసి దాని స్థానంలో మరుపురాని విజయాన్ని పదిలంగా దాచుకోవడానికి సరైన సమయం ఇదే. 2019 జూలై 9. ఇప్పటికీ మన జట్టును పీడకలలా వెంటాడుతున్న తేదీ ఇది.
India vs New Zealand: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో కీలకమైన సెమీ ఫైనల్స్కు సమయం ఆసన్నమైంది. బుధవారం భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీస్ పోరు జరగనుంది. సెమీస్లో గెలిచి ఫైనల్ చేరి ప్రపంచకప్ టోర్నీని నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ మ్యాచ్లో ఎలాంటి ప్లేయింగ్ 11తో ఆడబోతుందనే ఆసక్తికరంగా మారింది.
Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.
India vs New Zealand: ఈ టోర్నీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ మాత్రం ఏకంగా 4 మ్యాచ్లో ఓడిపోయింది. కానీ నెట్ రన్ రేటు బాగుండడానికి తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో సెమీస్ బెర్త్ దక్కింది. టేబుల్పై ఉన్న బల బలాల ప్రకారం చూస్తే న్యూజిలాండ్ను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాదు. అయినప్పటికీ అభిమానుల్లో కాస్త ఆందోళన ఉంది.
వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ పోరుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీస్ పోరులో ఫైనల్ బెర్త్ కోసం అతిథ్య జట్టు టీమిండియా, గత ప్రపంచకప్ రన్నరఫ్ న్యూజిలాండ్ చావోరేవో తేల్చుకోనున్నాయి. సెమీస్ పోరు కోసం ఐసీసీ, మ్యాచ్ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్స్టార్ ప్రచారాన్ని కూడా మొదలెట్టేశాయి. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య.