Home » Cricket news
సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ ప్రాంతంలోకి వస్తే.. ఎలాగైనా చూడాలనే ఆలోచనతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ బ్యాటర్ అభిమానులు.. ఏకంగా చెట్లు ఎక్కి.. తమ అభిమాన ప్లేయర్ ఆటను వీక్షించారు.
భారత యువ హిట్టర్ రింకూ సింగ్ వచ్చే ఏడాదిలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఎంపికనై సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ హజారే టోర్నీ 2025-26లో తాజాగా శుభారంభం చేశాడు.
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ , ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్లేయర్లు ఆయా జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్లు ఆడనున్నారు.
ఈ ఏడాది భారత పురుషుల జట్టు రెండు మేజర్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అలాగే మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడింది. ఇక, మహిళల అంధ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ దక్కించుకుని క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
టీమిండియా టీ20 జైత్రయాత్ర వెనుక బ్యాటర్ల కృషి ఎంత ఉందో, బౌలర్ల శ్రమ కూడా అంతే ఉంది. వివిధ దేశాలలో, వివిధ పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు నిలకడగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించారు.
ఉత్సాహవంతురాలిగా పేరు పొందిన జెమీమా ఈ లక్షణమే తన సూపర్ పవర్ అని అన్నారు. ఈ ఎనర్జీ ఎప్పుడు ఎలా వాడుకున్నామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా రేపు(ఆదివారం) తుది పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న చివరి మ్యాచ్లో తిలక్ వర్మ (73), హార్దిక్ పాండ్యా (63) అర్ధశతకాలు సాధించి టీమిండియాకు భారీ స్కోరు అందించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచింది. ఈ సిరీస్లో ఇప్పటికే టీమిండియా 2-1తో లీడింగ్లో ఉంది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డీఆర్ఎస్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని ఐసీసీ అంగీకరించింది.
న్యూజిలాండ్ స్టార్లు ప్లేయర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వేలు 95 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో తొలి వికెట్కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వెస్టిండీస్తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ సందర్భంగా ఈ ఘనత సాధించారు.