Home » Congress Govt
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్ని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
ఐదు డీఏలను పెండింగ్లో పెట్టిన ఘనత దేశంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. నెలకు రూ. 750 కోట్ల ఎరియర్స్ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ కీలక చర్యలు చేపట్టింది.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీవితాంతం బీసీల పేర్లతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
యావత్ ప్రపంచంలో వివిధ రకాల పూలతో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ బిడ్డలందరీ జీవితాల్లో వెలుగు నింపేదని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. భాగ్యనగరంలో సోమవారం రూ.5లకే బ్రేక్ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది. మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు.
రెండేళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాంచందర్ రావు.
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 2 సెంటిమీటర్ల వర్షాన్ని తట్టుకునే విధంగా గత పాలకులు హైదరాబాద్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారని తెలిపారు.
మూసరంబాగ్ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి రెండేళ్లు అయ్యిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. త్వరగా ఈ బ్రిడ్జి పూర్తి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ కుంటకు VHR బతుకమ్మ కుంటగా నామకరణం చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.