Home » Chennai News
హీరోయిన్ను ‘మీ బరువెంత?’ అంటూ ఓ ట్యూబర్ వేసిన ప్రశ్న కోలీవుడ్లో తీవ్ర వివాదం రేపుతోంది. అతనిపై ఆ హీరోయిన్తో పాటు పలువురు నటీనటులు, పాత్రికేయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ‘అదర్స్’ చిత్ర ప్రెస్మీట్లో ఓ యూట్యూబర్.. హీరోయిన్ గౌరీ కిషన్ బరువు గురించి అడిగాడు.
నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనిని అడ్డుకోవడంలో డీఎంకే ప్రభుత్వ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అన్నారు.
రాష్ట్రంలో ఈ నెల 8వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
పెళ్లిపీటలెక్కాల్సిన ఓ యువతి బాత్రూమ్లో అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో చోటుచేసుకుంది.
అనుమానం పెనుభూతమైంది.. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన ఇద్దరు పిల్లలను హతమార్చి, తనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం తెల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.
వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని దంతవైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కళ్లకుర్చి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుకోవిలూర్ సందైపేట సుబ్రమణ్యనగర్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ కుమార్తె అమృతవర్షిణి (24) దంత వైద్యురాలిగా పనిచేస్తోంది.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పొత్తు గురించి సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చర్చలు జరపలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వెల్లడించారు.
రాష్ట్ర నగరపాలన, తాగునీటి సరఫరా శాఖలలో ఉద్యోగాల ఎంపికల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ.35 లక్షల దాకా లంచం ఇచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఆరోపించారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్ఐఆర్పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.