Home » Chennai News
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన ఊటీలో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఊటీలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారు. వాటర్ బాటిళ్లు ఎక్కడా కనిపించవు. అయితే.. పర్యాటకుల కోసం ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేచయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకే పార్టీనేనని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడాలని తాము ఆశిస్తున్నామన్నారు.
అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించతలపెట్టిన రోడ్షోలకు అనుమతి ఇవ్వలేమంటూ.. పోలీస్ శాఖ పేర్కొంది. చిన్ననగరమైన పుదుచ్చేరిలో రోడ్షో నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, తమిళనాడులో లాగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ పోలీస్ శాఖ పేర్కొంది.
రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
కండక్టర్పై లా విద్యార్థిని చెప్పుతో దాడి చేసిన సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. దీనిపై రవాణా శాఖ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తరాది వారికి తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించడమేంటని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రశ్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాది వాసులకు ఓటు హక్కు కల్పిస్తే, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు