Home » Chandrababu
Andhrapradesh: కూటమి తనకు అభ్యర్థులే ముఖ్యమని.. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు రావాల్సిందే అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అని చెబుతున్నాయన్నారు.
ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్డిబేట్లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు (బుధవారం) రంగంలోకి దిగారు.
Andhrapradesh: వైసీపీ అరాచకాలను అంతమొందించడానికి... రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులందరూ ప్రజాక్షేత్రంలోకి రాక తప్ప లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర...
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మద్దతు తెలిపారు. బుధవారం చంద్రబాబుతో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కలిసి టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు టీడీపీకి మద్ధుతుగా నిలిచిందని గుర్తుచేశారు.
Andhrapradesh: ప్రధాని మోదీ విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని.. కాని విజయవాడ వాసులు మోదీ వస్తున్నారంటే నిరాశక్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మీట్ దిప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని.. దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.
ఏపీ అసెంబ్లీ 2024 (AP Election 2024), లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జగన్ సారధ్యంలోని వైఎస్సార్సీపీ మరోసారి ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ సారి పథకాలు రాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ వైసీపీ గ్యాంగ్ ఫేక్ విష ప్రచారం షురూ చేసింది. ఆసరా, చేయూత, ఫీజ్ రీయింబర్స్మెంట్లపై ఏపీ వాసులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తోంది.
Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని.. దీంతో ఏం చెప్పాలో తెలీక జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం వాకర్స్తో, ముఠా కార్మికులతో సుజనా భేటీ అయ్యారు. ముఠా కార్మికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేలా, ఉపాధికి మార్గాలు చూపే బాధ్యత తనది అంటూ భరోసా ఇచ్చారు.