Home » BJP
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ మంగళవారంనాడు విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని భరోసా ఇచ్చింది.
టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో మంగళవారంనాడు చేరారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్కుమార్కు సమర్పించారు.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని, తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 3న చెన్నై రానున్నట్లు తెలిసింది. ఆ రోజు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న మోదీని చెన్నైకికూడా రప్పించాలని ఎన్డీఏ నేతలు సన్నాహాలు చేపట్టారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. దీనిపై ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు.
శాసనసభ ఎన్నికల్లో అన్నామలై పోటీచేయాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.
ఇప్పసారా అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ రభసకు దారి తీసింది. ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తన వెర్షన్ వినిపించగా.. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి సెటైర్ వేశారు. ఇప్పసారా అంటే ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని మండిపడ్డారు.
గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచలేదు కానీ.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డికి సీతక్క కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సోమవారంనాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.