Home » Bhatti Vikramarka Mallu
తెలంగాణ రైజింగ్- 2047’ను సాధించడం, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వనరులను సమీకరించి సహాయక చర్యలు చేపడుతుందని మంత్రులు పేర్కొన్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 15 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఆయనే ముందుండి నిర్మింపజేశారని అప్పటి ప్రభుత్వ పెద్దలు హరీశ్రావుకు ‘కాళేశ్వర్రావు’ అనే పేరు పెట్టారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను లక్ష కోట్లకు పెంచారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టొద్దని, చర్చ చేయొద్దని హైకోర్టుకు వెళ్లి చేయాల్సింది అంతా మీరే చేశారని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించే సమయంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క అన్నారు.
విద్యా రంగ అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వంతో కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప మఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి బృందం బిజీ బిజీగా ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉన్న అవకాశాలపై న్యాయకోవిదుల సలహా కోరేందుకు మంత్రుల కమిటీ సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది.
సురవరంతో తనకు సుదీర్ఘ స్నేహం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనకు అనేక ఉద్యమాలు నడిపిన అనుభవం ఉందని స్మరించుకున్నారు. ఆయనకు తానంటే ప్రత్యేక అభిమానం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను చేపట్టిన పనులను అభినందించి, ప్రోత్సహించేవారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఉమెన్ పోలీసులో ఉమెన్ అన్న పదాన్ని వాడకుండా ఉండాలనే ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పురుషులతో సమానంగా విధులు నిర్వహస్తున్న మహిళలకు తగిన అవకాశాలతో పాటు వారి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముందన్నారు.