Home » Betting apps
విశాఖలో అక్రమంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐపీఎల్ సీజన్ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి, పదిమంది నిందితులను అరెస్ట్ చేశారు.
బెట్టింగ్,జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏపీలో ఆన్లైన్ గేమింగ్ పేరిట జరుగుతున్న బెట్టింగ్, జూద కార్యకలాపాలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
ఫేక్ ప్రిడిక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఫేక్ ప్రిడిక్షన్లు, బెట్టింగ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని సీపీ తెలిపారు.
తెలంగాణ పోలీసుల దెబ్బకు, జబర్దస్త్ ఫేమ్, టీవీ నటి రీతూచౌదరి దారికి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ వద్దంటూ వీడియో విడుదల చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశానని రీతూ చౌదరి ఒప్పుకుంది.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆన్లైన్ జూదం, బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా తిరుపతి నగరంలో ఒక ప్రధాన బెట్టింగ్ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు..
ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ల వ్యసనానికి అలవాటుపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మీర్పేట్లో జరిగింది. యువత జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తుందో చెప్పడానికి మీర్పేట్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.
ఆన్లైన్ బెట్టింగ్, జూదం వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతదేశంలో పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక నేరాలు, యువత వ్యసనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రస్తుత సమాజంలో ఒక సైలెంట్ వైరస్గా మారిపోయింది. యువత బెట్టింగ్ మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కామారెడ్డిలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆన్లైన్ వ్యసనం కారణంగా ఓ యువకుడు బలయ్యాడు.
ఇటీవల బెట్టింగ్ యాప్స్తో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఇందుకోసం కొంతమంది సెలబ్రెటీలను ప్రమోషన్లకు వాడుకుంటున్నారు.