Home » Bengaluru News
తుళునాడు ప్రాంతంలోని ఆధ్యాత్మిక సంప్రదాయంకు అనుగుణంగా విడుదలైన కాంతార చాప్టర్-1 దేశవిదేశాలలో సంచలనం సృష్టిస్తోంది. కాంతార పేరుతోనే సైకిల్ప్యూర్ అగరబత్తిను మార్కెట్లోకి విడుదల చేసింది.
సాంస్కృతిక నగరి మైసూరులో పట్టపగలు దారుణహత్య జరిగింది. దసరా ఉత్సవాలతో సందడిగా సాగిన మైసూరు ఇప్పుడే ప్రశాంత వాతావరణ పరిస్థితికి వస్తున్న తరుణంలోనే హత్య జరిగింది.
రాష్ట్రంలో వరదలతో పది జిల్లాలు అతలాకుతలమయ్యాయని వారిని ఆదుకునే విషయంలో రాష్ట్రప్రభుత్వం కుంభకర్ణుడి తరహాలో నిద్రపోతోందని ప్రతిపక్షనేత అశోక్ మండిపడ్డారు.
మార్కెట్లో ఉల్లిపాయల ధర ఒక్కసారిగా తగ్గిపోవడం రైతులకు నిరాశను మిగిల్చింది. జిల్లాలోని దేవదుర్గ తాలూకా అరకెరాకు చెందిన రైతు ఒకరు వారం రోజుల క్రితం ఉల్లిపాయ పంటను రాయచూరు ఏపీఎంసీ మార్కెట్ కు తీసుకురాగా ధర పూర్తిగా పడిపోవడంతో వారం రోజులుగా పడియావులు పడుతున్నాడు.
మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన జంబూసవారికి రాచనగరి సిద్ధమవుతోంది. గురువారం మధ్యాహ్నం జంబూసవారి వేడుకలు జరగనున్నాయి. వందలాది కళాబృందాలు, అశ్వదళం సాగుతుండగా గజరాజుల ఊరేగింపు జంబూసవారిలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
మైసూరు దసరా ఉత్సవాల్లో ఈసారి డ్రోన్షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాముండేశ్వరి విద్యుత్ సరఫరా కంపెనీ (సెస్క్) ఆధ్వర్యంలో బన్నిమంటప మైదానంలో ఆదివారం డ్రోన్ షో ప్రారంభమైంది. సుమారు 3వేల డ్రోన్లను ఉపయోగించి కొత్త లోకాన్ని సృష్టించారు.
ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.
రాయచూరు తాలూకాలోని డొంగరాంపూర్ గుట్ట పై సోమవారం మరో సారి చిరుత సంచారం కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొంగరాంపూర్ మామిడిదొడ్డి మద్యగల పొలంలో కుక్కపై దాడి చేసి చంపి వేయడంతో చిరుత సంచరిస్తున్న విషయం బయటికి పొక్కింది.
భోజనం చేశాం.. అయితే మాకే బిల్లు ఇస్తావా..అంటూ పోలీసులు ఓ మాజీ సైనికుడిపై విరుచుకు పడ్డారు. ధారవాడలో హోటల్ నిర్వహిస్తున్న మాజీ సైనికుడిని పోలీసులు చితకబాదిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 11గంటలకు సప్తపుర లే అవుట్ వివేకానంద సర్కిల్లో పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లారు.
చీరలు దొంగిలించిన ఓ మహిళను షాపు యజమాని ఇష్టారీతిన కొట్టిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. అయితే, చోరీ చేసిన మహిళతో పాటు ఆమెపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.