Home » Bandi Sanjay
ఆప్ను ఓడించడం ద్వారా మద్యం కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి అన్నారు.
Bandi Sanjay: ఇది సంక్షేమ బడ్జెట్- ప్రజల పెన్నిధి నరేంద్రమోదీ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కొనియాడారు. 2027 నాటికి అమెరికా, చైనా తరువాత మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా బడ్జెట్ను రూపకల్పన చేశారన్నారు. పత్తి, పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిది అని అన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న గల్లీకి గద్దర్ పేరు పెడతానని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్నకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ భూషణ్ సిఫార్సు చేస్తే తిరస్కరించడమే కాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన మీద అవాకులు చవాకులు పేలడం దుర్మార్గమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
CM Revanth Reddy: గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడమంటే.. ఏటా ఆయనను స్మరించుకోవడమేనని చెప్పారు. గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానా ల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమ లు చేయలేకపోయారని, 3 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చలేకపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు బీజేపీ నేతలకు ఆయన భావజాలం గుర్తుకు రాలేదా?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
నక్సల్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ జేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు.
ఇందిరమ్మ పేరు పెడితే తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.