Home » Balakrishna
మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. సోమవారం నాడు నందికొట్కూరు పటేల్ సెంటర్లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కర్నూలు: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంద్ర సాకార యాత్ర చేయనున్నారు. ఇవాళ నందికొట్కూరు, కర్నూలులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ( AP Elections 2024 ) వేళ ముఖ్య నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టారు.
నవరత్నాలతో సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. శనివారం నాడు కదిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నరసింహ స్వామి కదిరి ప్రాంతాన్ని కాపాడుతున్నారని తెలిపారు.
పతంజలి ఆయుర్వేద సంస్థ(Patanjali Ayurved) వ్యవస్థాపకుడైన బాబా రాందేవ్(Baba Ramdev), ఆ సంస్థ ఎండీ బాలకృష్ణపై(Balkrishna) సుప్రీంకోర్టు(Supreme Court of India) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో న్యాయస్థానానికి బేషరతుగా సంపూర్ణ క్షమాపణలు చెబుతూ వారు సమర్పించిన అఫిడవిట్ను..
అధికార వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ఆయన లేఖ రాశారు.
తనకు హిందూపురం ఎంపీ టికెట్ దొరుకుతుందని ఎంతో ఆశించిన పరిపూర్ణానంద స్వామికి చివరకు నిరాశే మిగిలింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. ఆ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అటు.. బీజేపీ ప్రకటించిన ఆరు ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో ఆయన మరింత నిరాశ చెందారు.
హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో ఏబీసీ దూకుడు పెంచింది. బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి అధికారులు విచారిస్తున్నారు. బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి.
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను రెండవ రోజు గురువారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొనున్నారు. నిన్న (బుధవారం) 7 గంటలు పాటు విచారించిన అధికారులు.. ఈరోజు మరోసారి చంచల్ గూడా జైలు నుంచి శివ బాలకృష్ణ ను కస్టడీ లోకి తీసుకుని విచారించనున్నారు.
హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో వైసీపీ నేత తిప్పన్న దౌర్జన్యం తాజాగా వెలుగు చూసింది. లేపాక్షి ఎస్సీ కాలనీలో టీడీపీ ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేస్తే తామే వేయాలని... ఎస్సీ కాలనీలో తమకు తెలియకుండా సిమెంట్ రోడ్డు వేస్తారా? అంటూ కాంట్రాక్టర్ను తిప్పన్న బెదిరిస్తున్నారు.