Share News

YCP: హిందూపురంలో వైసీపీ నేత దౌర్జన్యం

ABN , Publish Date - Jan 29 , 2024 | 10:15 AM

హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో వైసీపీ నేత తిప్పన్న దౌర్జన్యం తాజాగా వెలుగు చూసింది. లేపాక్షి ఎస్సీ కాలనీలో టీడీపీ ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేస్తే తామే వేయాలని... ఎస్సీ కాలనీలో తమకు తెలియకుండా సిమెంట్ రోడ్డు వేస్తారా? అంటూ కాంట్రాక్టర్‌ను తిప్పన్న బెదిరిస్తున్నారు.

YCP: హిందూపురంలో వైసీపీ నేత దౌర్జన్యం

అనంతపురం: హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో వైసీపీ నేత తిప్పన్న దౌర్జన్యం తాజాగా వెలుగు చూసింది. లేపాక్షి ఎస్సీ కాలనీలో టీడీపీ ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేస్తే తామే వేయాలని... ఎస్సీ కాలనీలో తమకు తెలియకుండా సిమెంట్ రోడ్డు వేస్తారా? అంటూ కాంట్రాక్టర్‌ను తిప్పన్న బెదిరిస్తున్నారు. రోడ్డును ధ్వంసం చేయకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నట్టు కాంట్రాక్టర్ చెబుతున్నారు.

రోడ్డును ధ్వంసం చేయవద్దని... అవసరమైతే బిల్లులు చేసుకోండంటూ వైసీపీ నేతకు కాంట్రాక్టర్ సర్ది చెప్పబోయినా వినే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ తన మాట కాదని రోడ్డు వేసినా తాను తవ్వుతానంటూ తిప్పన్న బెదిరిస్తున్నాడు. గత్యంతరం లేక సీసీ రోడ్డును సదరు కాంట్రాక్టర్ జేసీబీతో ధ్వంసం చేయించాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో రోడ్డు వేస్తే వైసీపీ నేత బెదిరించి ధ్వంసం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 10:15 AM