Home » AV Ranganath
సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐలాపూర్లో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను తొలగించే ప్రక్రియలో భాగంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైడ్రాపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను మంద కృష్ణ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ ముఖీం పరామర్శించారు.
అమీన్పూర్ మండలంలో రెండు పార్కులను హైడ్రా గురువారం కాపాడింది. సర్వే నంబరు 152, 153లో 15 ఎకరాల మేర 144 పాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట లేఔట్ వేశారు.
పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మైలార్దేవ్పల్లి శాస్ర్తిపురంలోని 6500 చదరపు గజాల క్రీడా మైదానంలో ఆక్రమణలను బుధవారం తొలగించింది.
గండిపేట మండలంలో దాదాపు 1.23 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఆ స్థలం విలువు దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని సెక్రటేరియట్ కాలనీవాసులు పేర్కొన్నారు.
మిడిల్ ఈస్ట్ దేశాల్లో చమురు కోసం జరుగుతున్న యుద్ధాల మాదిరిగానే.. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలను చూడబోయే కాలం మరెంతో దూరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
సర్కారు భూముల ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ రెవెన్యూ పరిధిలోని 354/1, 354/2, 354/3 సర్వే నంబర్లలోని 2.34 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు కాపాడారు.
సీఎం రేవంత్రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్.. దాని సమీపంలో ప్రభుత్వ భూమి.. ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమణలు.. ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో మెకానిక్ షెడ్లు.. గ్యారేజీలు, ఐరన్ అండ్ స్టీల్ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చారు.
నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన మణికొండలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను హైడ్రా సీజ్ చేసింది. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల స్థలాలను స్వాధీనం చేసుకుంది.