Home » AP High Court
బాలికల కళాశాల ప్రాంగణంలో కోఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 50 సెంట్ల స్థలంలో కళాశాల ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది.
శ్రీహరి, గిరీశ్ల పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇద్దరి అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది. అరెస్టు చేస్తారనేందుకు ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది.
సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్రెడ్డి, ఇతర నిందితులు అనాగరికంగా, అనైతికంగా, ఆటవికంగా, సంస్కారహీనంగా ప్రవర్తించారని హైకోర్టు ...
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భార్గవ్ రెడ్డిపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం.. అని విజయవాడలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? ప్రజలనా?’’ అని రాష్ట్ర హైకోర్టు మండిపడింది.
రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఒక శిశు సంరక్షణ విషయంలో ఇటీవల యూకే కోర్టు చేసిన వ్యాఖ్యలు, దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్వంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతిని కాపాడిన ప్రాణదాతగా నాటి మండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్కు పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు రాజధాని రైతులు.
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వైసీపీ నేత దాఖలు చేసిన మూడు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.