Home » AP Employees
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంక్రటామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.ఆర్. సూర్యనారాయణ మండిపడ్డారు. బుధవారం అమరావతిలో సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులతో తాము అంతర్గతంగా సమావేశం పెట్టుకుంటే తమపై చర్యలు తీసుకోవాలని ఈసీ సీఈవో మీనాకు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
వైసీపీ (YSRCP) ప్రభుత్వం వల్ల ఉద్యోగ సంఘాలు చాలా నష్టపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) అన్నారు. ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి రూ. 500 కోట్లను వైసీపీ ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రకియను ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్లో గందరగోళం నెలకొంది. చాలా మంది ఉద్యోగులకు సకాలంలో డ్యూటీ పాస్లు అందలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Employees) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఉద్యోగులు తమ పోస్టింగ్లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. దీంతో.. ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి..
Andhrapradesh: వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పడిన బాధలు అంతా ఇంతా కాదు. సరిగ్గా ఒకటో తారీఖున జీతాలు పడక ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడ్డారు. అసలు నెలలో జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితులు ఎదురయ్యారు. జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్ కోసం పెన్షన్దారులు ఎంత ఎదురు చూశారో తెలిసిందే.
ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు (AP High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ లెక్చరర్లకు పదోన్నతి కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఐదుగురు పిటీషనర్లు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటీషన్ల వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ముఖేష్ ముమార్ మీనా (CEO Mukesh Mumar Meena) కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని ఆదేశించారు.
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే తమకు బకాయిలు, మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ, అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) డిమాండ్ చేశారు.
Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దారుణంగా మారినట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సరైన సమయానికి జీతాలు పడక వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటో తారీఖున పడాల్సిన జీతాలు ఒక్కోసారి నెల మధ్యలోనూ పడిన సందర్భాలు ఉన్నాయి.