Home » AP Assembly Sessions
మంత్రి లోకేష్ మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోగ్యంపై అసెంబ్లీ చర్చించారు. నిమ్మల ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని ఆయన విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ కోరారు. దీనికి మరో సభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు తెలిపారు.
Minister Nara Lokesh: పాఠశాల, కాలేజీ విద్యపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మాట్లాడారు. స్కూళ్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పిల్లల్లో విద్యాపరంగా ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
AP Ministers: శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీ సభ్యులు మంత్రులను ఎదుర్కోలేక సభలో ఆందోళన సృష్టించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో పలు అంశాలపై మంత్రి నారా లోకేష్ ప్రస్తావించారు. ప్రధానంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా గురించి వైసీపీ నేతలు ప్రస్తావించడంతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని, వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్ట్రబ్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచిలవద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని.. మేం ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదని అన్నారు.
కనీసం రెండు సార్లు సమావేశం కావాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు.
వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీలకు గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్దమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దిళితున్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా.. వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అత్యవసర చర్చగా విదేశాల్లో చదువుతున్న భారతీయ మెడికల్ విద్యార్థుల సమస్యలపై చర్చ జరగనుంది. మెడికల్ గ్రేడ్యుయేట్ల సమస్యలపై మంత్రి సత్యకుమార్ సమాధానాలు ఇస్తారు.
‘వైసీపీ అధ్యక్షుడు (జగన్) వచ్చి నా పక్కన కూర్చుంటే చాలా సంతోషించేవాడిని అధ్యక్షా!’ అని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అన్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఆ చుట్టుపక్కల ప్రాం తాల ప్రజలు భయపడిపోయేవారు.