Home » AP Assembly Sessions
విశాఖ లో AI యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేటు విశ్వ విద్యాలయాల సవరణ బిల్లు-2025ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చామని, అందులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్ది సరికొత్త చట్టాలను తెస్తావతీ మంత్రి లోకేష్ వెల్లడించారు.
‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్... ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతే. వైసీపీ నేతలు చేసిన ప్రతి స్కాంపై దర్యాప్తు చేయిస్తాం.
మాజీ సిఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు.
శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు... రాష్ట్రంలో వలసలు... బిల్లుల చెల్లింపులో అక్రమాలు .. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అలాగే ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది.
Lokesh response YSRCP protests: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు వాళ్లే పెట్టి తిరిగి వాళ్లే ధర్నాలు చేయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు.
ఆయిల్ పామ్ పెంచడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయిల్ పామ్ పంటకు ప్రధానంగా స్పింక్లర్లు, డ్రిప్ కావాలని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో స్పింక్లర్లు, డ్రిప్ ఎందుకు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రులు సమాధానం ఇచ్చారు. భూ సమస్యలు, తలసేమియ వ్యాధి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై మంత్రులు మాట్లాడారు.
రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మునిసిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని అధికారులను సూచించారు.
Mandipalli Ramprasad Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణ చేస్తున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
Anam Ramanarayana Reddy: ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్పై వైసీపీ నేతలు పేపర్లు చించి వేసి అగౌరవపరిచారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. జగన్ స్వతహాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హితవు పలికారు.