Home » Andhrapradesh
పది రోజుల కన్నబిడ్డను చూసి వస్తూ.. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఉమ్మడి జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వజ్రకరూరు శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపుతప్పి బోల్తాపడడంతో నజీర్(20), బాబాఫకృద్దీన్(30) మృతిచెందారు.
ఇంట్లోని టీవీ వెనుక కప్బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు.
తమ గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని మండలం లోని పలు గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మ ల్లాకాల్వ, దర్శినమల, ఓబుళనాయునిపల్లి, నేలకోట, ఏలుకుంట్ల తదితర గ్రామాల నుంచి ధర్మవరానికి వెళ్లే రహదారి చాలా ఆధ్వానంగా తయా రైంది.
అదిగో చిరుత, ఇదిగో చిరుతలు ఉన్నాయంటూ అలిరెడ్డిపల్లె, వేంపల్లె రైతులు భయాందోళన చెందుతున్నారు. వేంపల్లె మండల పరిధిలోని పాపాఘ్ని నది అవతలున్న అలిరెడ్డిపల్లె సమీపంలోని ఎద్దలకొండ వెనుకవైపున అలిరెడ్డిపల్లె, వేంపల్లెకు చెందిన రైతులకు పొలాలు ఉన్నాయి.
ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి మనకు స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుల త్యాగాలు మరిచిపోకూడదని, ఈ నాటి స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితమే అని స్వాతంత్య్ర సమరయోధుడు పెడబల్లె బాలయల్లారెడ్డి అన్నారు. జిల్లాలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక స్వాంత్య్ర సమర యోధుడు ఈయనే.
క్యాలెండర్లో కాయితాలు చిరిగిపోతున్నాయి తప్ప, ప్రజల కడగండ్లు తీరుతున్నాయా? అధికారం చేతులు మారింది తప్ప, జీవనప్రమాణాలు పెరిగాయా? సొంత పాలనలోకి మారి ఏడు దశాబ్దాలు దాటి ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నా పల్లెలు ఈసురోమంటూనే ఉన్నాయి. సేద్యం ఒక జూదంగా మారిపోయింది.
పులివెందుల నియోజకవర్గ మంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెబు తుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరి స్తూ వస్తోంది.
టేకులోడు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రారంభించింది. రైతులు సాగులో ఉన్న 600 ఎకరాల అసైన్డ్ భూములను సేకరిస్తోంది. ఎకరానికి రూ. 12,66,067లుగా ప్రభుత్వం పరిహారాన్ని అందిస్తోంది. ఇదే అదనుగా కొందరు దళారుల అవతారం ఎత్తి అమాయక రైతులను టార్గెట్ చేస్తున్నారు.
మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో గురువారం వెలుగు సంఘాల అమృత మండల సమాఖ్య ఆధ్వర్యంలో త్రివర్ణపతాక ర్యాలీ నిర్వహించారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు.
తల్లిపాల వారోత్సవాలు గురు వారంతో ముగిశాయి. పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా అన్నారు. బిడ్డ ఆరునెలల వయస్సు వరకు తల్లిపాలు తాగించాలన్నారు.