Home » Andhra Pradesh
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మోహిని అలంకారంలో భక్తులకు కోదండరామయ్య దర్శనమిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు పలు చోట్ల 42 డిగ్రీలు దాటేశాయి.
ఏపీలో పేదలు పండుగ చేసుకుంటున్నారు. సొంతింటి కల సాకారమైందంటూ సంబరాలు చేసుకున్నారు. టిడ్కో ఇళ్లకు గృహప్రవేశాలు చేసుకుని, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
స్థానిక బార్ అసోసియేషన నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది శ్రీకాంత రెడ్డి ఎన్నికయ్యా రు. పట్టణంలోని బార్ అసోసియేషన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి శ్రీకాంత రెడ్డి, మనోహర్ బాబు పోటీ పడ్డారు.
పట్టణంలోని సీహెచసీలో కమ్యూనిటీ మరుగుదొడ్లు, 108 వాహనం పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. రోగులు ఇబ్బందు లు పడకూడదన్న ఉద్దేశ్యంతో గతంలో స్వచ్ఛ భారత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ మరుగుదొడ్లు పూర్తి అధ్వాన స్థితికి చేరుకుని, వృథాగా పడి ఉన్నాయి.
రైతు క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అ న్నారు. ఆయన సోమవారం ప్రజావేదికలో విలేకరుల సమావేశం నిర్వ హించి మాట్లాడారు. బీటీపీ కాలువ పనులను పూర్తి చేసి కృష్ణాజ లాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
రాష్ట్రంలో పేదరికాన్ని పా రదోలడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుప డుతున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవా రం సాయంత్రం స్థానిక ఎస్ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో మార్గదర్శి బంగారు కుటుంబం (ఎంబీకే) 10-20 వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వ హించారు.
పరస్పర సహకా రంతోనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం డ్వామా కార్యాలయంలో డీఎల్డీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీ-4 సర్వే వార్షికోత్సవాన్ని నిర్వ హించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట లభించింది. లక్ష్మీదుర్గపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ను న్యాయస్థానం రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో విశాఖ గాజువాక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డబ్బుల కోసం ప్రియురాలు వేధిస్తోందని మౌనిక అనే మహిళను నిందితుడు రవీంద్ర అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఘటనా స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లారు.