Home » Andhra Pradesh
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు.
వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిపై నమోదైన డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై పీటీ వారెంట్ను అనుమతించింది విజయవాడ కోర్టు.
కృష్ణా జిల్లాలోని గుడివాడ యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బ్యాంక్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. రత్నమ్మ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కాకినాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రాష్ట్రవ్యాస్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబరు 31వ తేదీ నాటికి పూర్తవు తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు మూడు కాదు.. నాలుగు కానున్నాయి.. రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా పోల వరం ఏర్పాటు కానుంది.
ఇమామ్లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మండల పరిధిలోని ఓరు వాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం మండల వ్యవ సాయ అధికారి లక్షీప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు.