Home » Andhra Pradesh
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భావనపాడు తీరంలో, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మాజీ ఎంపీ నానిపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సెటైర్లు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి నాని రాసిన లేఖపై చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజార్ రౌడీల స్థాయి కన్నా దిగజారి ప్రవర్తించారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని ఎద్దేవా చేశారు.
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
అమరావతికి వైసీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ రావడంతో జరిగిన ఘటనకు సంబంధించి రాజధాని రైతులు స్పందించారు. వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని ధ్వజమెత్తారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్లో వైసీపీ నేతలపై పలు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.