Home » Ananthapuram
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘కొత్త’ సందడి నెలకొంది. పార్టీ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున విచ్చేశారు. దీంతో కార్యకర్తలు, నాయకులతో కార్యాలయం కిక్కిరిసిపోయింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సం ఇంకా గ్రామాల్లో అలజడి రేపుతూనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాస్త దెబ్బతింటోంది. అంతేగాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
టమోటా ధర మళ్లీ పెరిగింది. మార్కెట్లో కేజీ రూ. 46కు విక్రయిస్తుండగా.. మరికొన్నిచోట్ల రూ. రూ. 55 వరకు విక్రయిస్తున్నారు. నిన్న మిన్నటివరకు ధర లేక దిగాలు పడ్డ రైతులు పెరిగిన ధరలతో కొ్ంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకలకుంట గ్రామం.. ఆకుకూరల ఖిల్లాగా ప్రసిద్ధిచెందింది. దాదాపు 45 సంవత్సరాలుగా ఆ గ్రామంలోని సన్న చిన్నకారు రైతులందరూ ఆకుకూరలను పండిస్తూ లాభాలను పొందుతున్నారు.
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల్లో చిరుతపులుల సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. కళ్యాణదుర్గం మండల కేంద్రానికి ఓ గ్రానైట్ కొండపై, అలాగే కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.
అనంతపురంలో కిలో గోధుమ పిండి.. కేవలం రూ.20కే విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో రూ. రూ.40ల నుంచి రూ.80ల వరకు అమ్ముతుండగా.. ప్రజల కోసం రాష్ట్రప్రభుత్వం రేషన్ షాపుల్లో కేవలం రూ.20కే విక్రయిస్తోంది. దీంతో ప్రజలు రేషన్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు.
మెరుగు పెడతామంటూ.. గ్రామాల్లో తిరుగుతూ బంగారం గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి వచ్చి ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని చెబుతూ మోసాలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
శబరిమలకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో నదిలో స్నానానికి దిగి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. నందకుమార్ (27) అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అయితే.. బరిమలకు వెళ్లి వస్తూ నదిలో మునిగి చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కమిటీని నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం పూర్తవగా.. మిగతా 40 మందితో కమిటీ అధికారిక జాబితాను విడుదల చేశారు. ఈ కమిటీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించామని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.