Home » Anantapur
ప్రజాదర్బారులో ఇచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణం లోని టీడీపీ కార్యాలయం లో శనివారం ఉదయం ప్రజాదర్బాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి విన్నవిం చారు.
గ్రా మా లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం అందించిన చెత్త సేకరణ బండ్లు చెత్తకుప్పలోకి చేరాయి. డి. హీరేహాళ్ మండలంలోని సోమలా పురం, మురడి గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరించాల్సిన ఈ బండ్లు వినియోగానికి నోచుకోకుండా చెట్ల కింద, భవనాల పక్కన పడేశారు.
వైసీపీపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో వందలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
టమోటా సాగుకు గతంలో పెట్టుబడి చాలా తక్కువ అయ్యేది. దిగుబడి ఆశాజనకంగా వచ్చేది. ధరలు మధ్యస్తంగా ఉన్నా.. లాభాలు వచ్చేవి.
ప్రజల సౌకర్యార్థం చేపట్టిన బస్సు షెల్టర్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో నేమకల్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయ ణ రూ. 5 లక్షలు మంజూరు చేయగా దాదాపు మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు.
రాయలచెరువు రైల్వేస్టేషనలో ధర్మవరం ఎక్స్ప్రెస్, ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మండలవా సులు వినతిప త్రం అందజేశారు. అనంతపురంలోని కార్యాలయంలో ఎంపీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నా రా లోకేశ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. 2004 కంటే ముందు ఉపాధ్యాయులుగా పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన విధానం అమలు చేసినందుకు గాను శుక్రవారం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద కృతజ్ఞత సభను నిర్వహించారు.
టీడీపీని అప్రతిష్టపాలు చేయటానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీల ముసుగులో ఉన్న కొంతమంది టీడీపీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయ ని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2009లో బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ఆ కళాశాల బాలుర కళాశాల గదుల్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, హెచఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ కోర్సులలో 370మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భగత్సింగ్ నగర్లోని తన నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.