Home » America
ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. సోమవారం రాత్రి పక్కా ఇంలెటిజెన్స్ సమాచారంతో టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పలు కీలక ప్రాంగణాలపై దాడులు జరిపామని, అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై బాంబులు జారవిడిచామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్పై ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్కు సిద్ధమైందని సమాచారం.
పశ్చిమాసియలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఆమెరికా వైమానిక స్థావరాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులను ముమ్మరం చేసింది.
పశ్చిమాసియాలో యుద్ధం మరో తీవ్రమైన మలుపు తీసుకుంటోంది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడితే.. ఇరాన్ బదులుగా ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.
అమెరికాతో కలిసి ఇరాన్పై దాడి చేస్తామని గల్ఫ్ దేశాలు అంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు. అసలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం తనను కూడా ఆశ్చర్య పరిచిందని వ్యాఖ్యానించారు.
ఇరాన్తో యుద్ధం మరో నాలుగు, ఐదు వారాలు జరగొచ్చని, ఆ యుద్ధం ముగిసేలోపు మరింత మంది ఎక్కువ అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యర్థుల ఆయుధ నిల్వలు త్వరగా తరిగిపోయేలా చేసి పైచేయి సాధించడమే లక్ష్యంగా ఇరాన్ ముందుకు సాగుతోందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పశ్చిమాసియా పేలుళ్లతో దద్ధరిల్లిపోతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకూ ఇరాన్లో 550 మంది మృతి చెందారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.
అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీ కంపెనీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
భారత స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి.