Home » Air india
అహ్మదాబాద్లో విమానం కూలిన ఘటన నేపథ్యంలో.. ఎయిరిండియా విమానాల నిర్వహణలో టర్కిష్ టెక్నిక్ పాత్రపై అనుమానాలు తెలెత్తిన సంగతి తెలిసిందే. డ్రీమ్లైనర్ కూలిపోవడంలో టర్కిష్ టెక్నిక్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహాన్ని వైద్యులు ఆదివారం ఉదయం గుర్తించారు. ఆయన కుటుంబసభ్యుల డీఎన్ఏతో సరిపోల్చి నిర్ధారించామని తెలిపారు.
గత గురువారం, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 274 మంది మరణించారు. గత దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద విమానయాన ప్రమాదంగా దీనిని అభివర్ణిస్తున్నారు.
Air India plane crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు సివిల్ హాస్పిటల్ సీనియర్ వైద్యుడు వెల్లడించారు.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా... ఏఐ-171 విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఏఐ-171’ నెంబరును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇంజన్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రోటాకాల్ ప్రకారం ఏప్రిల్ 2025లో ఎడమవైపు ఇంజన్ను కూడా తనిఖీ చేశారని, ఇంజన్లో కానీ, విమానంలో కానీ ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెప్పారు.
అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘోర ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ బాధితుల మృతదేహాలను గుర్తించడంలో DNA పరీక్షల (Air India Crash DNA) ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికుల ప్రమాదకరమని సలోహ్పోర్ అనే విజిల్బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు. తాజాగా ఇదే విషయాన్ని మాజీ బోయింగ్ అత్యున్నత స్థాయి మేనేజర్ నుంచి విజిల్బ్లోయర్గా మారిన ఎడ్ పియర్సన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోక ముందు కాక్పిట్లో ఏం జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
విమాన ప్రమాద బాధితులను ఆదుకునేందుకు రూ.25 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించింది.