Home » Air force
భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్ఫోర్స్ పాత్ర చాలా కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి పాక్ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వాయుసేన తేజస్ యుద్ధ విమానాలను తనిఖీల కోసం తాత్కాలికంగా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
114 రఫేల్ జెట్స్ కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ ఎక్విసిషన్ కౌన్సిల్ త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడి భారత పర్యటనకు మునుపే గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
రక్షణ, వాణిజ్య మార్గాలకు కీలకమైన తీరప్రాంతమైన అరేబియన్ సముద్రంపై ఐఏఎఫ్ తమ ఆపరేషన్ సన్నద్ధత, ఏరియల్ సామర్థ్యాలను ప్రదేశించే లక్షంగా ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే నెలాఖరు కల్లా హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎయిర్ఫోర్స్కు రెండు తేజస్ ఎమ్కే-1ఏ యుద్ధ విమానాలను డెలివరీ చేస్తుందని డిఫెన్స్ సెక్రెటరీ తెలిపారు. పూర్తిస్థాయి వెపన్స్ ఇంటెగ్రేషన్తో విమానాలు డెలివరీ అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చింది. టెన్త్, ఇంటర్ చదివిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.30 వేలకుపైగా జీతం లభిస్తుంది.
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సైన్యం కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సన్నద్ధం చేస్తోంది. తాజాగా ఒడిశా తీరంలో పరీక్షించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొదటి విమాన పరీక్షను విజయవంతమైంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారత వైమానిక దళ సామర్థ్యం, పోరాట పటిమ, కార్యాచరణకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనంగా నిలిచిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు.