Home » Ahmedabad
ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళుతున్న ఎయిరిండియా విమానం.. ఆకాశంలో అంతెత్తున ఎగురుతుండగా దాని తలుపు వద్ద ‘బుస్సు’ మంటూ చప్పుడు మొదలైంది.. అంతేకాదు ఆ తలుపు స్వల్పంగా వణుకుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
భారత ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద విషాదం జూన్ 12న అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే.
ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి సమావేశమైంది. విమాన ప్రమాదానికి దారి తీసిన కారణాలపై చర్చించింది.
ఘటనా స్థలి నుంచి రమేష్ బయటకు వస్తుండగా ఆ వెనుక విమానం కాలిపోతున్న దృశ్యాలు పెద్దఎత్తున పొగ చుట్టుపక్కల వ్యాప్తించడం కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన అతనిని చూసి కొందరు అతన్ని అక్కడి నుంచి తరలించడం వీడియోలో చోటుచేసుకుంది.
Vijay Rupani: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృత దేహాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు అధికారులు రూపానీ కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో రాజ్కోట్కు తరలిస్తారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి.
గత గురువారం, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 274 మంది మరణించారు. గత దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద విమానయాన ప్రమాదంగా దీనిని అభివర్ణిస్తున్నారు.
Air India plane crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు సివిల్ హాస్పిటల్ సీనియర్ వైద్యుడు వెల్లడించారు.
Ahmedabad Plane Crash: అత్యంత విషాదకరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రధానంగా బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. బ్లాక్ బాక్స్లో ఎంత మేరకు సమాచారం ఉందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.