Home » Adilabad
కొత్త జిల్లాలు అలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందిస్తు న్నారు. అయితే పాలు, కోడిగుడ్లు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభు త్వం కొత్తగా యాప్లను అందుబాటులోకి తెచ్చింది.
సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి చెల్లించిన ఆదాయ పన్నును తిరిగి చెల్లించడానికి సీఎం రేవంత్రెడ్డి ఒప్పుకున్నారని, త్వరలోనే ప్రకటన చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు.
పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఆటాపాటల్లో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే వేసవి వేడికి చిన్నారులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 13న జరిగే పోలింగ్ కోసం అదనపు బ్యాలెట్ యూనిట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ర్యాండమై జేషన్ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సం తోష్ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నిక ల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏసీపీ రవికు మార్ సూచించారు. శుక్రవారం సాయం త్రం పట్టణంలో పోలీసులు, కేంద్ర బలగాలతో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్రావు అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణను అధిక మోజార్టీతో గెలి పించాలని శుక్రవారం గూడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాపూర్, ద్వారక, పెద్దపేట, లక్ష్మికాం తపూర్ గ్రామాల్లో ప్రచార సభలో ఎమ్మెల్యే మాట్లా డారు.
ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన టీ-ఫైబర్ ప్రాజెక్టు పురోగతి ప్రశ్నార్థంగా మారింది. సత్వర సేవలు, పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రతీ ఇంటికి ఆన్లైన్ సేవలు అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. 2015లో ప్రారంభమైన ఈ మెగా ప్రాజెక్టు 2022నాటికే పూర్తి కావాల్సి ఉంది.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో గ్రూపు తగదాలు కేడర్ను అయోమయానికి గురి చేస్తు న్నాయి. జిల్లా పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయిన ముఖ్య నాయ కులు కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏకతాటిపైకి రాకపోవడంతో కిందిస్థాయి నాయకులు ఆందోళన చెందుతున్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల , బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 13న జరిగే పోలింగ్కు అదనపు బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్లోనీ ఈవీఎం గోదాంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి రాజకీయ పార్టీల సమక్షంలో బ్యాలెట్ యూనిట్లను పరిశీలించారు.