Home » Adilabad
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.
పొలాల్లో మోటార్లు, వైర్లను దొంగలించేందుకు వచ్చిన దొంగలను రైతులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. మొరంచవాగు పరిసర ప్రాంతాల్లో గతంలో వరుసగా దొంగతనాలు జరగడంతో రైతులు అప్రమత్తమయ్యారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయించిన ఇద్దరు మహిళను పోలీసులు రక్షించారు.
పరిశుభ్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శనివారం దహెగాం మండలం కేంద్రంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో నెలకొన్న అపరిశుభ్రతను చూసి ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
జిల్లాలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతో పాటు తెల్లవారుజామున కొంచెం చలిగానూ ఉంటున్నది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న సుమన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
బాల్క సుమన్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలే పథకం ప్రకారం దాడి చేసి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు..
మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అరెస్టైన బాల్క సుమన్కు మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు.