Home » Actress
రన్యారావు బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రోటాకాల్ను దుర్వినియోగం చేశారని, తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పేరును ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
డీఆర్ఐ ఇంటరాగేషన్లో తనపై శారీరకంగా ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని రన్యారావు కోర్టుకు స్పష్టం చేశారు. అయితే మాటలతో వేధించడం, బెదిరించడం జరిగిందని, దాంతో తాను భావోద్యేగానికి గురయ్యానని చెబుతూ కోర్టులో ఆమె కంటతడి పెట్టారు.
తనను చిక్కుల్లోంచి బయటపడేయాలంటూ సిద్ధరామయ్య సర్కార్లోని ఇద్దరు మంత్రులను రన్యారావు సంప్రదించినట్టు బీజేపీ ఆరోపించింది. ఇది తీవ్రమైన ప్రోటాకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.
ఈ కేసులో గత శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరచడానికి ముందు కూడా ఆమె తన లాయర్ల వద్ద కంటతడిపెట్టారు. అసలు ఈ కేసులో తాను ఎలా ఇరుక్కున్నానో, విమానాశ్రయం వద్ద ఏమి జరిగిందో తలుచుకుంటూ తాను నిద్రపోలేదని, మానసిక స్థిమితం కోల్పోయానని చెప్పింది.
అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా రెండు టీమ్లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది.
నటి రన్యారావు ఫిర్యాదు చేయడం కానీ, లేఖ పంపడం కానీ చేస్తే ఆమెకు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి తెలిపారు.
ఇండియన్ సినిమా తొలి లేడీ సూపర్స్టార్గా వైజయంతీమాలకు ప్రత్యేక స్థానం ఉంది. 16 ఏళ్ల వయస్సులో 'వాళికై' అనే తమిళ సినిమాతో నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత సంవత్సరం 'జీవితం' అనే తెలుగు చిత్రంలో నటించారు.
Kannada Actress Arrest: తరచూ బెంగళూరు వెళ్లి వస్తున్న కన్నడ నటిపై విమానాశ్రయం అధికారులు అనుమానించారు. ఆ నటిపై నిఘా పెట్టగా.. దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి.
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు.
తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు.