Home » ABN Andhrajyothy Effect
అమరావతిలోని సీఆర్డీఏ భవన పనులు నత్తనడకన కొనసాగుతోండటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనంతో అధికారులు స్పందించి సీఆర్డీఏ భవన పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం లభించింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థిని మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
అధికారులతో మాట్లాడి చిట్టితల్లిని.. కేజీబీవీలో సీటు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు.. పత్తి చేనులో మగ్గిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పుప్పాలగూడలోని రూ.వేల కోట్ల విలువైన కాందిశీకుల భూములు అన్యాక్రాంతం అవడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో అధికారయంత్రాంగం కదిలింది.
తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సింగూరు కట్ట రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రమాదంలో సింగూరు రిజర్వాయర్’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి దారి తిరిగొచ్చింది. మైదానం గేట్లను మూసివేస్తూ ప్రహరీ నిర్మించడంపై ‘ఉప్పల్ స్టేడియానికి దారేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కదిలివచ్చాయి.
రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్ట్ చేశామని చెప్పారు.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. గురువారం కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే తమ తొలి లక్ష్యమని బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు నారపరాజు రాంచందర్రావు చెప్పారు.