Home » 2024
నియోజకవర్గ కేంద్రం సమీపం లోని మరవకొమ్మ వద్ద బస్టాప్ ఏర్పాటు చేయిస్తాని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. రోడ్డు పనులు జరిగిప్పటి నుంచి అక్కడ బస్సులు నిలపకపోవడంతో చాలా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం నేషినల్ హైవే అధికారులతో కలసి శింగనమల మరవకొమ్మ వద్ద జరుగుతున్న ఎనహెచ 544డి జాతీయ రహదారుల పనులను పరిశీలించారు.
ప్రతి పాఠశాలలో తప్పని సరిగా మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖాధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె మంగళ వారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్, సమగ్ర శిక్ష, సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ అధికారులు, నియోజకవర్గంలోని ఆరు మండలాల విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు.
నగరపాలికకు పాలన భయం పట్టుకుంది. కలెక్టర్ వినోద్కుమార్ నగర ఇనచార్జ్ కమిషనర్, అధికారులపై అక్షింతలు వేశారు. దీంతో ఈ నెల 16 నుంచి సెలవుపై వెళ్లాలనుకున్న నగర కమిషనర్ రామలింగేశ్వర్ మంగళవారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 27రోజుల పాటు సెలవులో వెళ్లారు. దీంతో నగరపాలికను నడిపించే ఉన్నతాధికారే కరువయ్యారు.
బాలికలు, మహిళల ఉజ్వల్ భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతోగానో దోహపడుతుందని ఐసీడీఎస్ఐ పీడీ వనజాక్కమ్మ పేర్కొన్నారు. గార్లదిన్నెలో కిశోరి వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ ముఖ్య అథితులుగా హజరైమాట్లాడారు.
పీఏబీఆర్ కుడి కాలువ కింద నిర్దేశించిన అన్ని చెరువులకు నీరు అందించాల్సిందేనని ఎమ్మెల్యే పరి టా ల సునీత ఇరిగేషన అధికారులను ఆదేశించారు. మండలంలో ని గోళ్లపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడి కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు.
మండలంలోని మరూరు సబ్ స్టేషన సమీపంలోని అంగనవాడీ కేంద్రం వద్ద నుంచి వాల్మీకి విగ్రహం వరకు ఇళ్లలోని వ్యర్థపు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. బీసీ కాలనీలో మురగు నీరు ప్రవహించే కాలువలు లేక పోవడంతో ఇళ్ల లోని వ్యర్థపు నీరు, కొళాయిల నుంచి వృథా అయ్యే నీరు రోడ్డుపైనే నిరం తరం ప్రవ హిస్తోంది.
మండలంలోని బండమీదపల్లి నుం చి పాలబావికి వెళ్లే మట్టి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. రోడ్డు మొ త్తం రాళ్లు తేలి గుంతలమయమైంది. దీంతో బండమీదపల్లి నుంచి పాల బావి కి వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1988-89 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు సావిత్రమ్మ, రామాంజనేయులురెడ్డిని ఘనంగా సన్మానించారు.
వివాదాలు, ఆరోప ణల నడుమ ఎట్టకేలకు జిల్లా అండర్-12 బాలుర జట్టును ఎంపిక చేశా రు. ఎంపిక చేసిన తుది జట్టు వివరాలను జిల్లా క్రికెట్ సంఘం ఆదివారం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో ప్రకటించింది.
విద్యయా అమృత మశ్నుతే అంటూ ఎదిమిది దశాబ్దాల క్రితం సిరివరం ఆదినారాయణ రావు ఏర్పాటుచేసిన ఎస్ఎస్బీఎన కళాశాల విద్యార్థుల కు వరంగా మారింది. 1944లో ఓ గుడిసెలో పా ఠాల బోధనతో ప్రారంభమైన కళాశాల నేడు మర్రి మానులా విస్తరించింది. ఈ ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కాలంలో వేలాదిమంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దింది.