STUDENTS : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:22 AM
మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1988-89 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు సావిత్రమ్మ, రామాంజనేయులురెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఆత్మకూరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1988-89 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు సావిత్రమ్మ, రామాంజనేయులురెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు వారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలను గర్తు చేసుకొని సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాసులు రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....