ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్లో శ్రీనాథ్రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఒమాహా, నెబ్రాస్కాలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాలు ఈ ఏడాది అంబరాన్నంటాయి.
లండన్ వేదికగా తెలుగు ఎన్నారైల క్రికెట్ పండుగ షురూ అయింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో 10 జట్లతో TPL 2026 17వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు సాగనున్న ఈ సమరంతో పాటు ఆరోగ్య స్పూర్తిని రగిలించే 'వన్ మిలియన్ అడుగుల ఛాలెంజ్' కూడా నిర్వహిస్తున్నారు.
ప్రముఖ తెలుగు రచయిత, సాహితీవేత్త వేలూరి వేంకటేశ్వరరావు సంస్మరణ సభ అమెరికాలోని చికాగోలో జరిగింది. శనివారం(మే 16) నేపర్విల్ నగరంలోని 195వ స్ట్రీట్ పబ్లిక్ లైబ్రరీలో స్థానిక సాహిత్యకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ, పరిశుభ్రత, పరిరక్షణ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తానా చేపట్టింది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవ్య, శనివారం రాత్రి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
బాపులపాడు మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తానా కోశాధికారి, ప్రముఖ ఎన్నారై రాజా కసుకుర్తి నిరంతరాయంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
కువైత్లో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మహానాడును వేడుకగా జరుపుకున్నారు.
దుబాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినీ మహానాడు వేడుకను వైభవంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ దుబాయి అధ్యక్షుడు యం. విశ్వేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పెనమలూరు శాసన సభ్యులు బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఆస్ట్రేలియాలో 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఒక భారత సంతతి వ్యక్తికి స్థానిక కోర్టు 13 ఏళ్ల 10 నెలల కారాగార శిక్ష విధించింది.