మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే అనేక మంది క్రమేణా కుటుంబ సమేతంగా సుదీర్ఘ కాలం పాటు అక్కడ నివసిస్తుంటారు. ఈ క్రమంలో ఆ విదేశీగడ్డపై పుట్టిపెరిగే చిన్నారులు ఆప్యాయత, అనురాగాల లేమితో యాంత్రికంగా కాలం వెళ్లదీస్తున్నారు.
అమెరికా రాజధాని పరిధిలో భానుప్రకాశ్ మాగులూరి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం.. రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులును ఘనంగా సత్కరించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తానా నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తెలిపారు. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు సహకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల వ్యవహారాలపై అవగాహన కల్గిన దౌత్యవేత్త విపుల్ ను సౌదీ అరేబియాలో నూతన రాయబారిగా భారత ప్రభుత్వం నియమించింది.
అమెరికాలోని న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన పికిల్బాల్ టోర్నమెంట్ ఘన విజయం సాధించింది. వివిధ ప్రాంతాల నుంచి పికిల్బాల్ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు.
డాలస్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక స్థలి భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన యాత్రాస్థలి అని ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి వ్యాఖ్యానించారు. ప్రసాస భారతీయుల ఐక్యతకు, కార్యదీక్షకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు.
పిల్లల్లో అంధత్వ నివారణే ధ్యేయంగా, గత 50 ఏళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలందిస్తున్న 'ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలిచింది. అంధత్వ రహిత సమాజ స్థాపనలో భాగంగా భారీ విరాళాన్ని అందజేసింది.
రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ నగరం విచ్చేశారు. ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందనసభ విజయవంతంగా జరిగింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్, ప్రముఖ వైద్య నిపుణుడు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన మారథాన్లలో ఒకటైన టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి మరో అరుదైన ఘనతను సాధించారు.
అమెరికాలోని తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు.