అసోంలో చొరబాట్ల వ్యవహారం ఎన్నికల అంశం మాత్రమే కాదని.. ఇది రాష్ట్ర గుర్తింపు, జాతీయ భద్రతకు సంబంధించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మతాలు, ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రధాని మోదీకి శ్రద్ధ లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ విమర్శించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేస్తున్న ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ తన ఆస్తులను వెల్లడించారు.
తనకు రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో విజయ్ పేర్కొన్నారు. తన భార్య సంగీతకు రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామికి ఉద్వాసన పలకాలని, తద్వారా బీజేపీ మాయమాటలకు తమిళనాడు లొంగదని బలంగా చాటిచెప్పాలని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు బీజేపీ పరోక్షంగా మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్కు, సీపీఎం-బీజేపీ కంబైన్కు మధ్యే జరగనుందని అన్నారు.
నక్సలిజం నిర్మూలనపై లోక్ సభలో చర్చ మెుదలైంది. మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్కుమార్కు సమర్పించారు.
రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారంనాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్కు అందజేశారు.
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీకి సోమవారంనాడు నామినేషన్ వేశారు. తూర్పు తిరుచ్చి నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు.