రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారంనాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్కు అందజేశారు.
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీకి సోమవారంనాడు నామినేషన్ వేశారు. తూర్పు తిరుచ్చి నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సోమవారంనాడు తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కొలతూర్ నియోజకవర్గంలో రోడ్షోలో పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు విడతల్లో జనగణన జరుగుతుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు.
బంగ్లాదేశ్లో ఉంటూ భారత్పై దాడులకు వ్యూహరచన చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్కు చెందిన షబ్బీర్ అహ్మద్ లోన్ లష్కరే తోయిబా ఆపరేటివ్.
కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ పేలుడులో ఒక భారతీయుడు మృతి చెందారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని కువైట్ ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది.
విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోరు తెరిచేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఎయిర్లైన్స్ భద్రతాధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు దెయ్యం పట్టిందని, అందుకే అలా ప్రవర్తించానని చెప్పాడు.
రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించే దిశగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల ప్రకటనలను రైల్వే స్టేషన్ల పరిధిలో గానీ, రైలు బోగీలపై కానీ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ రైల్వేశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆకలితో ఉన్న మావోయిస్టులకు అన్నం పెట్టి ఓ ఎస్సై మానవత్వం చాటుకున్నారు. ఛత్తీ్సగఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.