అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఏడాది తర్వాత, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలపై 'ది సెకండ్ ఆర్బిట్'అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యకమైన విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
జార్ఖండ్లోని ఈస్ట్ సింగ్భూమ్ జిల్లాలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మలేరియా కారణంగా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 48 గంటల్లో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవటం, మరి కొంతమంది మలేరియా బారినపడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య జరిగిన 10 రోజుల తర్వాత నిందితులు సియా, చేతన్ చౌదరీలను క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం లోహగడ్ కోట దగ్గరకు తీసుకెళ్లారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
సీషెల్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ మహాసముద్రంపై తనదైన ముద్ర వేశారు. 'మహాసాగర్' సంకల్పాన్ని తీసుకొచ్చారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రధాని మోదీకి సీషెల్స్.. దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసింది.
మరికొద్ది రోజుల్లో అమర్నాథ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు వచ్చే భక్తులకు జమ్మూ కశ్మీర్లోని హోటళ్ల యజమానులు గుడ్ న్యూస్ చెప్పారు.
పుణెలోని లోహగడ్ కోట వద్ద జూన్ 18న వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్పూర్కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎప్పుడో ముత్తాతల కాలంలో ప్రారంభమైన భూ వివాదం ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పరిష్కారమయింది. 15.5 బీఘాల (9.68ఎకరాలు) భూమి విషయమై 1957లో మొదలయిన కేసుపై ధర్మాసనం నాలుగో తరానికి చెందిన భూమి యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.