దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు.
కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేయటంలో ఇరాన్ బిజీ అయిపోయింది. ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా కొత్త సుప్రీం లీడర్ రేసులో ఉన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ దాడిలో ధ్వంసం అయిన సినగాగ్ దగ్గరకు సోమవారం వెళ్లారు. భారీ భద్రత మధ్య అక్కడ పర్యటించారు.